భారతీయవంటకాలతో మన్మోహన్కు బుష్ విందు
వాషింగ్టన్: అమెరికాలోపర్యటిస్తున్న భారత ప్రధాని డాక్టర్మన్మోహన్ సింగ్కు అమెరికా అధ్యక్షుడుజార్జి బుష్ అపురూపమైన విందు ఇచ్చారు. బాస్మతి బియ్యం,చల్లని పానీయాలు, తాజా కూరగాయలతో చేసినభారతీయ వంటకాలు ఘుమఘుమలాడించాయి.విందు ఇచ్చిన వేదిక అలంకరణలో సైతం భారతీయత ఉట్టిపడింది. మన్మోహన్ సింగ్,ఆయన సతీమణి గురుశరణ్ కౌర్కివిశిష్ట ఆతిథ్యం లభించింది. ఒకరకంగావారిద్దరికి బుష్ సొంత ఇంటిని తలపించారు.
బుష్ ఆయన సతీమణిసహా 134 మంది అతిథులు ఈ విందుకు హాజరయ్యారు.డైనింగ్ హాల్లో బుష్కు ఎంతో ఇష్టమైన కాషాయరంగు సిల్క్ టేబుల్ క్లాత్ పరిచారు.లెమన్ క్రీమ్, బాగా వేయించిన సముద్రపుచేపల వేపుడు, అల్లం - కారట్ -పెరుగు మిశ్రమం, పిస్తా పప్పు కలిపినబాస్మతి బియ్యంతో చేసిన వంటకం పాటుఅనేక పానీయాలు, ఐస్ క్రీములతో విందుఇచ్చారు. బ్లాక్ టై అధికారిక విందుగా దీన్నిపేర్కొంటారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనతరవాత అదీ శ్వేత భవనంలో బుష్ఇటువంటి విందు ఇవ్వడం ఇది అయిదో సారి మాత్రమే.