వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుర్గాకుమారిఉదంతంపై లోకాయుక్త విచారణ
హైదరాబాద్:ఇటీవల అంబర్ పేట సమీపంలో మ్యాన్హోల్లో పడి మరణించినబ్యాంకు ఉద్యోగిని దుర్గా కుమారిఉదంతంపై లోకాయుక్త స్వచ్ఛందంగావిచారణ చేపట్టింది. భారీవర్షం కురిసినరోజున భర్త టూవీలర్ వెనుక కూర్చున్నదుర్గా కుమారి మ్యాన్హోల్ మూత తెరచి ఉండడంతోటూవీలర్ నుంచిఎగిరి కింద పడింది. అక్కడ మ్యాన్హోల్మూత లేకపోవడంతో ఆమె లోపలికిపడిపోయింది. భర్త కళ్ళ ముందే ఆమెడ్రైనేజిలో కొట్టుకుపోయింది. ఆమెశవం మరుసటి రోజు మూసీనదిముఖద్వారం వద్ద కన్పించింది. ఆ సమయంలో ఆదుకోవాల్సినడ్రైనేజిఅధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈసంఘటన నగర వాసుల హృదయాన్నికదిలించింది. ప్రభుత్వ అధికారుల మీదవారికి ఆగ్రహం కలిగించింది.
Comments
Story first published: Tuesday, July 19, 2005, 23:53 [IST]