వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సినీనటి, ఎంపి జయప్రదకు బెయిల్ మంజూరు
హైదరాబాద్: సినీనటి, సమాజ్వాదీ పార్టీ లోక్సభ సభ్యురాలు జయప్రదకు నాంపల్లి కోర్టు సోమవారం బెయిల్ మంజారు చేసింది. జయప్రదపై 2003లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై హైదరాబాద్లోని ముషిరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఆమె తెలుగుదేశంపార్టీలో ఉన్నారు. ఈ కేసులో ఆమె ఇంతకు ముందు కోర్టుకు హాజరు కావాల్సింది ఉంది. అయితే ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు వారంట్ జారీ చేసింది. దీంతో ఆమె సోమవారం తన న్యాయవాది విష్ణువర్ధన్రెడ్డితో కలిసి జయప్రద కోర్టుకు హాజరయ్యారు.
Story first published: Monday, July 25, 2005, 23:53 [IST]