పోలవరం, గ్రేటర్ హైదరాబాద్లకు హైకోర్టు బ్రేక్లు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు ప్రతిపాదన విషయాల్లో ప్రభుత్వానికి హైకోర్టు నుంచి చుక్కెదురయింది. పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ అనుమతి లభించే వరకు పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలని హైకోర్టు తెలియజేసింది. పోలవరంపై విచారణను హైకోర్టు నాలుగువారాల పాటు వాయిదా వేసింది.
గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు ప్రతిపాదనపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇదిలావుంటే, కమ్యూనిస్టు దేశాల్లో కూడా అన్ని అనుమతులూ వచ్చిన తర్వాతనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కాదని, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో అనుమతులు వస్తాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహబూబ్నగర్ జిల్లాలో అన్నారు. జలయజ్ఞానికి అందరూ సహకరించాలని, ఎవరు వ్యతిరేకించినా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ఇబ్బందిగా మారుతుందని ఆయన అన్నారు.