వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌: కుప్పకూలిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బులవాయో: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్‌ కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బౌలర్ల ముందు భారత బ్యాట్స్‌మెన్‌ ఏ ఒక్కరూ నిలదొక్కుకోలేకపోయారు. భారత బ్యాట్స్‌మెన్‌ ఒక్కరొక్కరే మైదానంలోకి దిగి వెంటనే వెనుదిరగడం ఆనవాయితీగా మారింది. షేన్‌ బాండ్‌, ఆడమ్స్‌లు భారత బ్యాట్స్‌మెన్‌ పట్ల సింహస్వప్నాలయ్యారు. భారత బ్యాట్స్‌మెన్‌లో సెహ్వాగ్‌ మినహా ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. భారత బౌలర్లు రాణించారని సంతోషిస్తున్న సమయంలో బ్యాట్స్‌మెన్‌ అత్యంత దారుణంగా నిరాశపరిచారు. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ 43.1 ఓవర్లలోనే కుప్పకూలింది. 215 పరుగులకే న్యూజిలాండ్‌ వికెట్లన్నీ కోల్పోయింది. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆదుకున్నారు. పఠాన్‌ మూడు, నెహ్రా రెండు వికెట్లు తీసుకున్నారు.

న్యూజిలాండ్‌ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి భారత బ్యాట్స్‌మెన్‌ నుంచి ఏ విధమైన ప్రయత్నమూ జరిగినట్లు కనిపించలేదు. సెహ్వాగ్‌, గుంగూలీ ఓపెనర్‌గా దిగారు. ఐదు పరుగులకే గంగూలీ పెవిలియన్‌ దారి పట్టగా, ఆ తర్వాతి బంతికే వేణుగోపాలరావు వికెట్‌ను జారవిడుచుకున్నాడు. ఆ తర్వాత ద్రావిడ్‌, యువరాజ్‌ సింగ్‌, కైఫ్‌, సెహ్వాగ్‌, ధోనీ, అజిత్‌ అగార్కర్‌ ఇట్లా వచ్చి అట్లా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ధోని, అగార్కర్‌ రెండేసి పరుగులు చేశారు. ద్రావిడ్‌ ఐదు పరుగులు చేశాడు. యువరాజ్‌ సింగ్‌ ఒకే ఒక పరుగు చేశాడు. సెహ్వాగ్‌ 15 పరుగులు చేశాడు. కైఫ్‌ తొమ్మిది పరుగులు చేశాడు. 44 పరుగులకే భారత్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X