వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొద్దు శీను ఆచూకీ వైయస్‌కు తెలుసు: సునీత

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల హత్య కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్‌ రెడ్డి అలియాస్‌ మొద్దు శ్రీను సంగతి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికే తెలుసునని అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ్యురాలు పరిటాల సునీత వ్యాఖ్యానించారు. మొద్దు శ్రీనును వైయస్‌ దాచాడో, పైకే పంపాడో తెలియదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పరిటాల రవి జయంతి సందర్భంగా తన స్వగ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని, ఇతర సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహించారు.

మొద్దు శీను బయటకు వస్తే పరిటాల రవి హత్యలో తన కుమారుడు వై.యస్‌. జగన్మోన్‌ రెడ్డి, మంత్రి జె.సి. దివాకర్‌ రెడ్డి, ఐజి మీనాల ప్రమేయం బయటపడుతుందని వైయస్‌ మొద్దు శీనును దాచి ఉంటాడని లేదా హత్య చేయించి ఉంటాడని ఆమె అన్నారు. పరిటాల రవిని ప్రభుత్వమే హత్య చేయించిందని ఆమె ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసులో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆమె విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X