వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బగ్దాద్‌లో తొక్కిసలాట: 700 మంది దాకా మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

బగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 700 మంది దాకా మరణించి వుంటారని అనుమానిస్తున్నారు. టైగ్రిస్‌ నదిపై గల వంతెన మీదుగా ర్యాలీ సాగుతుండగా ఆ వంతెన కూలిపోయింది. దానికి తోడు మానవ బాంబు పేలనున్నదనే వదంతులు బయలుదేరాయి. దీంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. మానవబాంబు పేలనుందనే వదంతులతో ఒక్కసారిగా వంతెనను దాటడానికి ప్రజలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

షైట్‌ సూఫీ వార్షిక వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇమామ్‌ మౌసా ఆల్‌ - కదీమ్‌ మసీదు వద్ద దాదాపు పదిలక్షల మంది గుమికూడారు. తొక్కిసలాటకు ముందు మోర్టర్‌, రాకెట్‌ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఏడుగురు మరణించగా, 40 మంది దాకా గాయపడ్డారు. రాకెట్‌ లాంచర్లతో దాడి చేసిన వారిపై ఆపాచే హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. ఒక వైపు రాకెట్‌ పేలుళ్లు, మరో వైపు మానవబాంబు పేలనున్నదనే వదంతులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో అక్కడి నుంచి పరిగెత్తే తొందరలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మసీదులో బాంబు పేలినట్లు కూడా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X