8న ఆర్టీసి కార్మికుల సమ్మె నోటీసు
పరిస్థితిని అర్థం చేసుకుని కార్మికులు సహకరిస్తారని, సమ్మెకు దిగబోరని ఆశిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఆర్టీసీ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరగువుతోందని, కార్మికులు సమ్మెకు దిగితే చక్కబడుతున్న పరిస్థితి మరింత దిగజారుతుందని, ఈ విషయాన్ని కార్మికులు గుర్తిస్తారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఈ నెల 3వ తేదీననే సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు మొదట అనుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్లీనం జరిగేనాటికి సమ్మె జరిగేలా నోటీసలు ఇవ్వాలనే ఆలోచనతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని జె ఎసి నాయకులు ఒప్పుకోవడం లేదు. పండుగలున్నందున ప్రజలకు ఇబ్బంది కలగకుండా పండగలన్నీ ముగిసిన తర్వాత సమ్మెకు దిగాలనే ఉద్దేశంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని వారంటున్నారు. ప్రభుత్వ తీరుపై ఈ లోగా ప్రజలకు వివరించనున్నట్లు వారు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!