వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుల నిర్మూలనసంఘం నేత ప్రసాద్ హత్య
ఒంగోలు: కులనిర్మూలనసంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడుమన్నెం ప్రసాద్ హత్యకు గురయ్యారు. ప్రసాద్ను తామేహత్య చేశామని నల్లమల కోబ్రా సంస్ధప్రకటించింది. సింగరాయ కొండ వద్ద ఈహత్య జరిగింది. ఉదయం పదిగంటల నుంచితనను ఎవరో వెంబడిస్తున్నారనిప్రసాద్ చెప్పినట్టు ఆయన పనిచేస్తున్నసహకార బ్యాంకు ఉద్యోగులు చెప్పారు.ప్రకాశం జిల్లా ఎప్పీగా ఉన్నప్పుడు లడ్డాపైహత్యా యత్నం కేసులో ప్రసాద్నుఅదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించివిడిచిపెట్టారు. శనివారం మధ్యాహ్నంప్రసాద్పై బ్యాంకులో ఉండగానే దుండగులుదాడి చేసి గొడ్డలితో నరికి చంపారు. పౌర హక్కుల సంఘంనాయకుడు కనకాచారిని నర్సాకోబ్రాలుహత్య చేసిన విషయం తెలిసిందే.కాగా పోలీసులు, మాజీ నక్సలైట్లు ఇలాకోబ్రాలుగా మారి ప్రజా సంఘాల నాయకులనుహతమార్చుతున్నారని ప్రగతిశీలసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
Story first published: Saturday, September 10, 2005, 23:53 [IST]