కాంగ్రెస్అక్రమాలపై తెలుగుదేశం ఫిర్యాదు
హైదరాబాద్:మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీఅక్రమాలకు పాల్పడుతోందనితెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికలకమిషనర్ డాక్టర్ ఎవిఎస్ రెడ్డికిఫిర్యాదు చేసింది. అనేక చోట్లతెలుగుదేశం అభ్యర్ధులను బెదిరించిఉపసంహరింపజేశారని తెలుగుదేశంఆరోపించింది. ఎన్నికల కమిషనర్నుకలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరోసభ్యుడు దేవేందర్ గౌడ్, నాగ ంజనార్ధనరెడ్డి, ఉమా మాధవరెడ్డి ఉన్నారు. తాడిపత్రిలోఐదువార్డులలో తెలుగుదేశం అభ్యర్ధుల మీదదౌర్జన్యం చేసి నామినేషన్లనుఉపసంహరింపజేశారని వారు ఆరోపించారు.రాష్ట్రంలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయోవారు ఒక స్టేట్మెంట్ను ఎన్నికలకమిషనర్కు సమర్పించారు.ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మునిసిపల్ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికలకమిషనర్ ఎవిఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు.2002లో జారీ అయిన జీవో ఆధారంగానే తాను ఈసర్క్యులర్ జారీ చేసినట్టు ఆయన చెప్పారు.
మునిసిపల్ ఎన్నికల్లోఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిఅడ్డదారులుతొక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్నాయకుడు యనమలరామకృష్ణుడు విజయవాడలోవిమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారంచేయనని మొదట చెప్పినవైఎస్ ఇప్పుడు ప్రాజెక్టు బాటలో పాల్గొంటాననడం ఆయనభయానికినిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications
