కెసిఆర్, నరేంద్రలపై అధిష్ఠానానికి ఫిర్యాదు: టిఆర్సిసిసి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నేతలు, కేంద్ర మంత్రులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్సిసిసి) నాయకులు తెలిపారు. టి ఆర్యస్ కేంద్ర మంత్రులపై రాష్ట్రపతి అబ్దుల్ కలామ్కు, ప్రధాని మన్మోహన్ సింగ్కు, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని టిఆర్సిసిసి నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎం. కోదండరెడ్డి తదితరులు తెలిపారు. యుపిఎ ప్రభుత్వంలో కొనసాగుతూ కెసి ఆర్, నరేంద్రలు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాల్సినవని వారన్నారు.
కెసి ఆర్, నరేంద్ర వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని, ఈ విషయాన్ని తమ అధిష్టానానికి తెలియజేస్తామని వారు చెప్పారు. తెలంగాణవారికి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవో అమలు శాసనసభలో చర్చకు మాత్రమే పరిమితమైందని, అది అమలుకు నోచుకోలేదని వారన్నారు. 610 జీవోను వెంటనే అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరి నదిపై తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కూడా వారు డిమాండ్ చేశారు.