వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భాగ్యనగరవీధుల్లో నిమజ్జనోత్సవాలు
హైదరాబాద్:వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారంనగరంలోని రోడ్లు పండుగ శోభను సంతరించుకున్నాయి. వివిధప్రాంతాల నుంచి వస్తున్న వినాయకవాహనాలతో మధ్యాహ్నం నుంచి రోడ్లునిండిపోయాయి. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డులో జనం కిక్కిరిసిపోయారు. ట్యాంక్బండ్ వద్ద 18 క్రేన్లు,నెక్లెస్ రోడ్డులో 8 క్రేన్లు గణేష్విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలోనిమగ్నమయ్యాయి. పోలీసులు హెలికాప్టర్ద్వారా విద్రోహులపై డేగ కన్ను వేశారు.డప్పు వాయిద్యాలు, నృత్యాలతో చిన్నపిల్లలుమొదలు వృద్ధుల వరకు ఈఉత్సవంలో పాల్గొన్నారు. 45 అడుగులఎత్తైన ఖైరతాబాద్ భారీ గణేశుడినిమజ్జనం రాత్రి ఎనిమిది గంటల తర్వాతజరుగుతుంది.
Comments
Story first published: Saturday, September 17, 2005, 23:53 [IST]