హైదరాబాద్కు చేరిన గుంటూరు వివాదం
హైదరాబాద్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్లో నెలకొన్న వివాదం హైదరాబాద్కు చేరింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సమక్షంలో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వర్గం హైదరాబాద్కు చేరుకుంది. మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుమారుడు నాగరాజును మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకత్వం ఎంపిక చేయడాన్ని రాయపాటి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం వల్ల మేయర్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది.
ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటానని రాయపాటి సాంబశివరావు అంటున్నారు. కన్నా వర్గానికి మెజారిటీ ఉంటే క్యాంపు రాజకీయాలు ఎందుకు నడపాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన చెప్పారు. రాయపాటితో పాటు పిసిసి అపరిశీలకుడు పిన్నమనేని కోటేశ్వరరావు, శాసనసభ్యుడు సుభాని హైదరాబాద్కు చేరుకున్నారు. తమకే మెజారిటీ ఉందని మంత్రి కన్నా లక్ష్మినారాయణ వాదిస్తున్నారు.