వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు ఎన్‌కౌంటర్లు: ఒక మావోయిస్టు హతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ నుంచి నలుగురు నక్సలైట్లు తప్పించుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం మద్దిమడుగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన కృష్ణపట్టి దళం నక్సలైట్‌ ప్రభాకర్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మూడు తుపాకులు, 30 రౌండ్ల బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా మహానంది అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి నలుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు ఆయన తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఒక తపంచాను, రెండు గ్రెనేడ్లను, ఒక కిట్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X