రాష్ట్రంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం: వైయస్
యురి (జమ్మూ కాశ్మీర్): భూకంప బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని మారమూల ప్రాంతంలో ఉన్న యురి పట్టణంలో ఆమె ఆదివారంనాడు పర్యటించి భూకంప బాధితులను పరామర్శించారు. శ్రీనగర్లోని బేస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారిని కూడా ఆమె పరామర్శించారు.
కేంద్రం చేయాల్సిందంతా చేస్తుందని, బాధితుల సహాయం కోసం అవసరమైన వస్తుసామగ్రిని కేంద్రం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి పంపుతుందని ఆమె చెప్పారు. "మీరు తీవ్ర బాధలో ఉన్నారనే విషయం తెలుసు. మీ వెంట మేం ఉన్నాం అని ఆమె భరోసా ఇచ్చారు. "మీ దుఃఖంలో పాలు పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. సైన్యం క్షతగాత్రులకు చికిత్స సహాయం అందిస్తోంది అని ఆమె చెప్పారు.
బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేయాల్సింది కూడు, గూడు కల్పించడమని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. 40 వేల బ్లాంకెట్లు, టెంట్స్ అవసరమవుతాయని ఆమె అన్నారు.