వన్డే జట్టు: వేణు ఇన్- లక్ష్మణ్ అవుట్
మొహాలీ: శ్రీలంకతో జరిగే వన్డే క్రికెట్ సిరీస్ తొలి రెండు వన్డేలకు ఎంపికైన భారత జట్టులో ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావుకు చోటు దక్కింది. హైదరాబాద్ బ్యాట్స్మన్ వి.వి.యస్. లక్ష్మణ్కు స్థానం దక్కలేదు. తొలి రెండు వన్డేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్టర్లు భారత జట్టును శుక్రవారంనాడు ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మొదటి రెండు వన్డేలకు ఎంపిక కాలేదు. సచిన్ టెండూల్కర్ జట్టులో చేరాడు.
రాహుల్ ద్రావిడ్ను కెప్టెన్గా భారత సెలెక్టర్లు గురువారంనాడే ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్గా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహరిస్తాడు. గాయం కారణంగా మహ్మద్ కైఫ్ జట్టుకు దూరమవుతున్నాడు. జహార్ఖాన్, బాలాజీ, అనిల్ కుంబ్లేలు కూడా జట్టులోకి రావడం లేదు. కేరళకు చెందిన యువ మీడియం పేసర్ శ్రీసంత్కు జట్టులో స్థానం దక్కింది. సురేష్ రైనా ఎంపికయ్యాడు.
భారత జట్టు
రాహుల్ ద్రావిడ్ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్ (వైస్ కెప్టెన్), సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వేణుగోపాలరావు, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మురళీకార్తిక్, హర్బజన్ సింగ్, అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), శ్రీసంత్, ఆర్.పి. సింగ్, జె.పి. యాదవ్