వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిడుగులు పడి 12 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం కురిసిన అకాల వర్షాలు, పిడుగుల కారణంగా 12 మంది మరణించారు. మెదక్ జిల్లాలో నలుగురు, నల్గొండ జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో భారీ వర్షాల కారణంగా జన జీవనం స్తంభించింది. హాలియా మండలం తిరుమల గిరి గ్రామంలో పిడుగులు పడి తల్లీకొడుకులు నాగమ్మ, శంకర్ మరణించారు. త్రిపురారం మండలంలో జ్యోతి అనే యువతి పిడుగుపాటు వల్ల మరణించింది.
Story first published: Sunday, April 16, 2006, 23:53 [IST]