వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సరోవర్ ప్రాజెక్టుపై మోడీ నిరశన దీక్ష
అహ్మదాబాద్: నర్మదా నదిపై నిర్మిస్తున్న సర్ధార్ సరోవర్ ప్రాజెక్టుపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆదివారం 51 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. పలువురు మత గురువులు ఆశీర్వాదాలతో సబర్మతి ఆశ్రమంలో ఈ మధ్యాహ్నాం మోడి దీక్షను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని మోడి ఈ సందర్భంగా అన్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి వర్గ సహచరులు, పార్టీ సీనియర్ నాయకులు మోడి దీక్షకు కూర్చున్న వేదికపై ఆశీనులయ్యారు. మోడికి మద్దతుగా ఎండను సైతం లెక్క చేయకుండా పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.
Comments
Story first published: Sunday, April 16, 2006, 23:53 [IST]