వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరోవర్‌ ప్రాజెక్టుపై మోడీ నిరశన దీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: నర్మదా నదిపై నిర్మిస్తున్న సర్ధార్‌ సరోవర్‌ ప్రాజెక్టుపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆదివారం 51 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. పలువురు మత గురువులు ఆశీర్వాదాలతో సబర్మతి ఆశ్రమంలో ఈ మధ్యాహ్నాం మోడి దీక్షను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని మోడి ఈ సందర్భంగా అన్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి వర్గ సహచరులు, పార్టీ సీనియర్‌ నాయకులు మోడి దీక్షకు కూర్చున్న వేదికపై ఆశీనులయ్యారు. మోడికి మద్దతుగా ఎండను సైతం లెక్క చేయకుండా పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X