గ్యాంగ్స్టర్ సిన్మాకు తొలగిన గ్రహణం
ముంబై: గ్యాంగ్స్టర్ చిత్రం విడుదలపై వచ్చిన అభ్యంతరాలు తొలగిపోయాయి. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని ముంబయి హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటీషన్ను వాపసు తీసుకునేందుకు మాఫి యా డాన్ అబూసలెం అంగీకరించాడు. ఈ మేరకు ఆయన చేసిన విజ్ఞప్తిని స్థా నిక టాడా కోర్టు మన్నించింది. ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ రూపొందించి న ఈ చిత్రం తన వ్యక్తిగత జీవితం ఆధారంగా రూపొందించిందని, ఇందులో ముంబయి బాంబు పేలుళ్లతో తన పాత్ర ఉన్నట్లు చిత్రికరించారని సలెం న్యా యమూర్తికి విన్నవించాడు.
అయితే ఇందులో సలెం జీవితానికి సంబంధించిన అంశాలు ఏమిలేవని, పూర్తి కల్పిత కథ ఆధారంగా చిత్రాన్ని రూపొందించామని మహేశ్ భట్ న్యాయస్థానానికి తెలియజేశారు. న్యాయమూర్తి సూచన మేరకు సలెం న్యాయవాది, సంబంధితులు చిత్ర ప్రివ్యూను తిలకించటంతో వారికున్న అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో ముంబయి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను వాపసు తీసుకునేందుకు సలెం అంగీకరించాడు.