వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్, బొబ్బిలి ఉపఎన్నికలు డిసెంబర్ 4న
హైదరాబాద్: కరీంనగర్, బొబ్బిలి లోక్సభ స్ధానాలను ఉప ఎన్నికలను డిసెంబరు 4న నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దీని కోసం ఈనెల 10 న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు నవంబర్ 17. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 20. ఎన్నికల ప్రచారం డిసెంబర్ 2వ తేదీ సాయంత్రంతో ముగియాలి. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టిఆర్ఎస్ అభ్యర్ధిగా చంద్రశేఖరరావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా జీవన్రెడ్డి, తెలుగుదేశం అభ్యర్ధిగా ఎల్ రమణ, బిజెపి తరఫున విద్యాసాగరరావు పోటీ చేయనున్నారు. డిసెంబర్ 9న కరీంనగర్, బొబ్బిలి ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Story first published: Tuesday, November 7, 2006, 23:53 [IST]