వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాలెగావ్ పేలుళ్లు: ఇద్దరు యునానీ వైద్యుల అరెస్టు
ముంబాయి: మహారాష్ట్రలోని మాలెగావ్ వరుస బాంబు పేలుళ్ల కేసులో తీవ్రవాద వ్యతిరేక బృందం పోలీసులు మంగళవారంనాడు ఇద్దరు యునానీ వైద్యులను అరెస్టు చేశారు. ముంబాయిలోని గోవండిలో రహస్య స్థావరం నుంచి సల్మాన్ అనే వైద్యుడ్ని అరెస్టు చేయగా, మాలెగావ్లో ఫరూఖ్ అనే వైద్యుడ్ని అరెస్టు చేశారు.
ఈ ఇద్దరు కూడా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నామని, మిగతా విషయాలు తదనంతరం తెలుస్తాయని తీవ్ర వ్యతిరేక బృందానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు పిటిఐ వార్తాసంస్థతో చెప్పారు. వారిద్దరిపై మోకా కింద కేసు నమోదు చేస్తామని, ఆ తర్వాత ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పరుస్తామని ఆయన చెప్పారు. ఈ అరెస్టులతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగుర్ని అరెస్టు చేసినట్లయింది. మాలెగావ్ వరుస పేలుళ్లలో 31 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు.
Story first published: Tuesday, November 7, 2006, 23:53 [IST]