వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిఐసిసి భూముల వేలానికి నిరసన: అరెస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐసిసి) భూముల వేలాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. వామపక్షాల కార్యకర్తలు, నేతలతో పాటు తెలుగుదేశం, బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు తొలుత ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రతిపక్షాల ఆందోళనతో భూముల వేలం మధ్యాహ్నం వరకు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం భూములను వేలం వేయడాన్ని అడ్డుకోవడంతో పాటు భూపోరాటం సాగిస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు రాని ప్రభుత్వం భూములను వేలం వేస్తోందని ప్రతిపక్షాల నాయకులు విమర్శించారు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు చెప్పారు. వేలంలో కొనుక్కున్న భూముల్లో కూడా జెండాలు పాతుతామని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X