మూడో ఫ్రంట్ పై చర్చలు అసంపూర్ణం
హైదరాబాద్:
తృతీయ
ప్రత్యామ్నాయంపై
ఉభయ
కమ్యూనిస్టులు
శుక్రవారం
జరిపిన
చర్చలు
ఒక
కొలిక్కి
రాలేదు.
ఈ
విషయంపై
చర్చలను
కొనసాగించాలని
సిపిఐ,
సిపియం
నాయకులు
నిర్ణయించారు.
అయితే
తృతీయ
ప్రత్యామ్నాయంపై
చర్చలు
జరపలేదని
సిపియం
రాష్ట్ర
కార్యదర్శి
బి.వి.
రాఘవులు
మీడియా
ప్రతినిధులతో
చెప్పారు.
అవసరమైనప్పుడు
చర్చిస్తామని,
ఎవరెవరు
వచ్చే
అవకాశాలున్నాయనే
విషయాన్ని
చూడాల్సి
ఉందని
ఆయన
అన్నారు.
సమస్యలపై
చర్చించి
ఉమ్మడి
కార్యక్రమాన్ని
రూపొందించుకోవడానికి
ప్రాధాన్యం
ఇచ్చినట్లు
ఆయన
తెలిపారు.
రాష్ట్రంలో
కలిసి
ఉద్యమాలు
సాగించాలని
నిర్ణయించినట్లు
సిపిఐ
రాష్ట్ర
కార్యదర్శి
కె.
నారాయణ
చెప్పారు.
ఈ
నెల
8వ
తేదీన
అధిక
ధరలకు
వ్యతిరేకంగా
ఆందోళన
చేయాలని
నిర్ణయించినట్లు
ఆయన
తెలిపారు.
భూసమస్యపై
25వ
తేదీన
జిల్లా
కలెక్టర్
కార్యాలయాల
వద్ద
ప్రదర్శనలు
నిర్వహిస్తామని
ఆయన
చెప్పారు.
ప్రజా
సమస్యలపై
దృష్టి
కేంద్రీకరించాలని
సమావేశంలో
అనుకున్నట్లు
ఆయన
తెలిపారు.