వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో ఫ్రంట్ పై చర్చలు అసంపూర్ణం

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: తృతీయ ప్రత్యామ్నాయంపై ఉభయ కమ్యూనిస్టులు శుక్రవారం జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంపై చర్చలను కొనసాగించాలని సిపిఐ, సిపియం నాయకులు నిర్ణయించారు. అయితే తృతీయ ప్రత్యామ్నాయంపై చర్చలు జరపలేదని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవసరమైనప్పుడు చర్చిస్తామని, ఎవరెవరు వచ్చే అవకాశాలున్నాయనే విషయాన్ని చూడాల్సి ఉందని ఆయన అన్నారు. సమస్యలపై చర్చించి ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కలిసి ఉద్యమాలు సాగించాలని నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. ఈ నెల 8వ తేదీన అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. భూసమస్యపై 25వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సమావేశంలో అనుకున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X