వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా ఆస్పత్రిపై రోగి బంధువుల దాడి

By Staff
|
Google Oneindia TeluguNews


విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఒక బాలుడి పరిస్థితి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే విషమించిందని ఆరోపిస్తూ అతని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. మైలవరానికి చెందిన బాలుడికి వైద్యులు ఇంతకు ముందు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. అయితే బాగు కాకపోవడంతో బాలుడిని మళ్లీ ఆస్పత్రికి తెచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

శస్త్రచికిత్స చేసినా అతని పరిస్థితి బాగు కాలేదు. పైగా మరింత విషమించింది. అతనికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలుడి పరిస్థితి విషమించిందని అతని బంధువులు ఆంధ్రా అస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి ఫర్నీచరును ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X