వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో 4గురు నక్సల్స్ హతం

By Staff
|
Google Oneindia TeluguNews


ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కిన్నెరసాని వాగు వద్ద పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మరణించారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ కూడా ఉంది. మరణించిన నక్సలైట్లలో జనశక్తి దళ కమాండర్ ప్రకాష్ ఉన్నట్లు సమాచారం.

పోలీసులు గాలింపు జరుపుతుండగా నక్సలైట్లు తారసపడ్డారు. ఈ సమయంలో నక్సల్స్ పారిపోతూ పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతూ కిన్నెరసాని వాగులో దూకి పారిపోతుండగా పోలీసుల కాల్పుల్లో నక్సల్స్ మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X