వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి జెడి - ఎస్ మద్దతు ఉపసంహరణ

By Staff
|
Google Oneindia TeluguNews


Yediyurappa బెంగూళూర్: కర్ణాటకలో బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వానికి జనతా దళ్ - సెక్యులర్ (జెడి -ఎస్)మద్దతు ఉపసంహరించుకుంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జెడి - ఎస్ నేత దేవెగౌడ తన పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో ఎక్కువ అధికారాలు ఆశించిన జెడి -ఎస్, అందుకు బిజెపి అంగీకరించకపోవడంతో మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

జెడి -ఎస్ రూపొందించిన 12 అంశాల అవగాహన పత్రంపై సంతకం చేయడానికి బిజెపి నిరాకరించింది. దాంతో జెడి - ఎస్ యెడ్యూరప్ప ప్రభుత్వ బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 225 సీట్లు ఉండగా బిజెపికి 79 మంది, జెడి - ఎస్ కు 58, కాంగ్రెస్ కు 65 మంది శాసనసభ్యులున్నారు. ఇతరులు 23 మంది ఉన్నారు. వెంటనే రాజీనామా చేయాలని బిజెపి అధిష్ఠాన వర్గం యెడ్యూరప్పకు సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X