వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు వాహనంపై మావోయిస్టుల దాడి

By Staff
|
Google Oneindia TeluguNews


విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న వాహనంపై మావోయిస్టులు గురువారంనాడు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు - గూడెం కొత్తవీధి మండలాల సరిహద్దులో బుధవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు.

ఈ సంఘటన కుంకుమపూడి వద్ద జరిగింది. ఎదురుకాల్పుల్లో మరణించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వాహనం కుంకుమపూడి వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ మందుపాతరలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X