పోలీసు వాహనంపై మావోయిస్టుల దాడి


విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న వాహనంపై మావోయిస్టులు గురువారంనాడు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు - గూడెం కొత్తవీధి మండలాల సరిహద్దులో బుధవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు.

ఈ సంఘటన కుంకుమపూడి వద్ద జరిగింది. ఎదురుకాల్పుల్లో మరణించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వాహనం కుంకుమపూడి వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ మందుపాతరలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+