వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ ఆటకట్టులో ఆంధ్ర ఆదర్శం: పియం

By Staff
|
Google Oneindia TeluguNews


Manmohan Singh న్యూఢిల్లీ: నక్సలైట్ల అణచివేతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మిగతా రాష్ట్రాలకు సూచించారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కునేందుకు ప్రత్యేకమైన, నిబద్ధత గల బలగాలను నియోగించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. జాతీయ అభివృద్ధి మండలి ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి గురువారంనాడు ప్రసంగించారు. వామపక్ష తీవ్రవాద సంఘటన ప్రతి రోజూ ఏదో ఒక చోట జరుగుతున్నదని, అటువంటి సంఘటన లేకుండా రోజు గడవడం లేదని ఆయన అన్నారు.

దేశ అంతర్గత భద్రతకు ముఖ్యమంత్రుల వ్యక్తిగత శ్రద్ధ, నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. మనకు సాధ్యమయ్యే అన్ని పద్ధతుల్లో నక్సలైట్ శక్తులను అణచివేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తీవ్రవాద గ్రూపులు హింసను పెంచబోతున్నాయనే విషయాన్ని నిఘా సంస్థలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. ఎప్పుడెలా దాడి చేస్తారో తెలియనంతగా తీవ్రవాదం పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X