పోలీసు స్టేషనులో రామోజీ లొంగుబాటు

విశాఖపట్నంలోని భూ యజమానిని మోసగించారనే ఆరోపణపై హైకోర్టు ఆదేశాల మేరకు రామోజీరావు పోలీసుల ముందు లొంగిపోయారు. విశాఖపట్నంలోని వర్మకు చెందిన భూమి విషయంలో మోసానికి గాను ఆయనపై పోలీసులు చీటీంగ్ కేసు నమోదు చేశారు.
కేసు పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి - రామోజీరావు తన సంస్థ కోసం వర్మ నుంచి భూమిని లీజుకు తీసుకున్నారు. అయితే యజమానికి తెలియకుండానే కొంత భూమిని రోడ్డు విస్తరణ పనులకు అప్పగించారు. దానికి ప్రతిగా నష్టపరిహారం కింద వచ్చిన 800 గజాల భూమిని యజమానికి తెలియకుండా తన సంస్థ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టులో కేసు వేశారు. దీనిపై రామోజీరావు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముందు విశాఖపట్నం త్రీటౌన్ పోలీసు స్టేషనులో లొంగిపోవాలని రామోజీరావును ఆదేశిస్తూ అందుకు కొంత గడువు ఇచ్చింది. దీంతో ఆయన తన కుమారుడు కిరణ్ తో కలిసి పోలీసు స్టేషనులో లొంగిపోయి, బెయిల్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications