చిదంబరం ఎన్నికల బడ్జెట్

ద్రవ్యోల్బణం నియంత్రణే తమ కర్తవ్యమని ఆయన చెప్పారు. వృద్ధిరేటు 8.7 శాతం ఉందని ఆయన చెప్పారు. ఆగస్టు నుంచి స్టాక్ మార్కెట్లు సంక్షోభంలో పడడంతో కాస్తా దెబ్బ తిన్నామని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.6 శాతం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహంపై దృష్టి పెట్టామని, ఆర్థిక లోటుకు మించి విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఉందని ఆయన చెప్పారు. అన్ని రంగాలవారికి ఏదో మేరకు రాయితీలు ప్రకటిస్తూ ఆయన బడ్జెట్టులో ప్రతిపాదనలు చేశారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగాలకు 20 శాతం నిధులు పెంచారు. ఆరో వేతన సవరణ సంఘం సిఫార్సులు మార్చిలో వస్తాయని, ఈ సిఫార్సులు ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగానే ఉంటాయని ఆయన చెప్పారు. ఆహార ధాన్యాల దిగుబడిలో ఆల్ టైం రికార్డు సాధించామని ఆయన చెప్పారు.
ముఖ్యాంశాలు












Click it and Unblock the Notifications