టెన్త్ దాకా మధ్యాహ్న భోజనం: వైయస్

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి, రైతులకు, గ్రామీణాభివృద్దికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. హైదరాబాదులో నేషనల్ ప్లాన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పట్ల ఆయన హర్షం వక్తం చేశారు. రుణ మాఫీ పథకం వల్ల రాష్ట్రంలోని రైతులకు ఎలా మేలు జరుగుతుందనే విషయాన్ని ఆయన వివరించారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్టులో తగిన ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో తలపెట్టిన ఐఐటిని కూడా బడ్జెట్టులో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ లో తలపెట్టిన హ్యాండీక్రాఫ్ట్ మెగా క్లస్టర్ వల్ల మహిళలకు లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications