డిఎస్ తెలివైనవారు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితులను చక్కదిద్దడం నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు కష్టమేనని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శ్రీనివాస్ తెలివైనవారని, తెలంగాణ అంశంతో పాటు అన్ని అంశాలను చక్కదిద్దగలరని ఆయన ప్రశంసించారు.
శ్రీనివాస్ తెలివైనవారు కాబట్టే రెండో సారి పిసిసి పదవిని పార్టీ అధిష్ఠానవర్గం అప్పగించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని శ్రీనివాస్ చేసిన ప్రకటనను ఖండించారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవడమే తెలంగాణకు కాంగ్రెస్ అనుకూలమని చెప్పినట్లని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications