వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ జిల్లా తహసిల్దారుపై ఎసిబి దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై విశాఖలోని పరవాడ తహసీల్దారు ధర్మారావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం దాడులు చేశారు. విశాలాక్షి నగర్ లోని ఆయన నివాసంలో ఎసిబి అధికారులు ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తహసిల్దారు ధర్మారావు పేరిట పరవాడ ప్రాంతంలో దాదాపు 23 వరకు ఇళ్ళ స్ధలాలు ఉన్నట్టు తెలిసింది. వెస్ట్ గోదావరి జిల్లాలో 12 ఎకరాల వ్యవసాయ భూమి, సబ్బవరం , అనకాపల్లిలో 9 ఎకరాలు ఉన్నట్టు ప్రాధమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. విశాఖ జిల్లా పరవాడ తహసిల్దారు కార్యాలయంలోను, ఏలూరు, చాటపర్రు, హైదరాబాద్ లోని ఆయన సమీప బంధువుల నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X