వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపులకు బీసీ స్ధితిపై అధ్యయన కమిషన్: వైఎస్ హామీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చే విషయంపై అధ్యయన కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. చాలాకాలంగా ఉన్న ఈ డిమాండ్‌పై అధ్యయనం జరిపి, కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సచివాలయంలో కాపు వర్గానికి చెందిన మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మండలి బుద్ధప్రసాద్, జక్కంపూడి రామ్మోహనరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీ బాలశౌరి తదితరులు ముఖ్యమంత్రిని కలసి దీనికి సంబంధించి ఓ వినతిపత్రం సమర్పించారు.

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల స్థితిగతులపై అధ్యయనం చేయించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయగలమని హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X