వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాపులకు బీసీ స్ధితిపై అధ్యయన కమిషన్: వైఎస్ హామీ
హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చే విషయంపై అధ్యయన కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. చాలాకాలంగా ఉన్న ఈ డిమాండ్పై అధ్యయనం జరిపి, కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సచివాలయంలో కాపు వర్గానికి చెందిన మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మండలి బుద్ధప్రసాద్, జక్కంపూడి రామ్మోహనరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీ బాలశౌరి తదితరులు ముఖ్యమంత్రిని కలసి దీనికి సంబంధించి ఓ వినతిపత్రం సమర్పించారు.
కాపు,
బలిజ,
తెలగ,
ఒంటరి
కులాల
స్థితిగతులపై
అధ్యయనం
చేయించాలని
కోరారు.
వారి
విజ్ఞప్తిపై
సానుకూలంగా
స్పందించిన
ముఖ్యమంత్రి
త్వరలోనే
దీనికి
సంబంధించి
ఆదేశాలు
జారీ
చేయగలమని
హామీ
ఇచ్చారు.
Comments
Story first published: Thursday, March 27, 2008, 14:02 [IST]