రామోజీపై ఉండవల్లి మరోసారి ధ్వజం

మార్గదర్శి విషయాలపై తాను వేసిన ప్రశ్నలకు రామోజీ రావు సమాధానం ఇవ్వాలని, తనపై రామోజీ చేసిన ఆరోపణలకు తాను సమాధానాలు ఇస్తానని, తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే క్షమాపణ చెప్తానని ఆయన అన్నారు. మిగతా వ్యక్తుల జీవితాల్లోకి ప్రవేశించే హక్కు రామోజీకి ఎలా వచ్చిందని ఆయన అడిగారు. ఇతరుల జీవితాల్లోకి ప్రవేశించడానికి తనకు హక్కు ఉందనుకుంటున్న రామోజీరావు తాను ఆదాయం పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మీడియాను ఫొటోలు తీసుకోకుండా ఎందుకు అడ్డుకున్నారని ఆయన అడిగారు. తెలుగుదేశం అధికారిక పత్రిక సంపాదకుడిగా, వ్యాపారవేత్తగా మార్గదర్శి వివరాలను ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం, కేంద్రంలో దేవెగౌడ ప్రభుత్వం ఉన్న కాలంలో చట్టవ్యతిరేకంగా విగ్రహాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు రామోజీరావు చిక్కారని, ఆ వార్తను రామోజీ ఈనాడులో ఎందుకు ప్రచురించలేదని ఆయన అన్నారు. రామోజీరావు అపరాధ భావనకు గురయ్యారని ఆయన అన్నారు. ఈనాడులో, ఈటీవీలో ఇతరుల విషయాలను వక్రీకరించి రాస్తారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
