బాలకృష్ణ పార్టీలో ఉన్నారు: బాబు

తన మీ కోసం యాత్ర ఈ నెల 21వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. చంద్రగిరి నుంచి తన యాత్ర మొదలవుతుందని ఆయన చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తన యాత్రను ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వ అవినీతిపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తాను మీ కోసం పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వేల కోట్ల రూపాయల భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. మద్యం ద్వారా 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రాబడుతోందని ఆయన అన్నారు. ప్రజల ఆస్తులకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం వాటిని దోచుకు తింటోందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications