కాంగ్రెస్, టిడిపి చీకటి స్నేహం: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదారాబాద్: తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శుక్రవారం తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు ఆ ప్రకటన చేశారని ఆయన అన్నారు. తెలంగాణపై ఇతర ప్రాంతాల అభిప్రాయం ఎందుకని ఆయన అడిగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ పాలకులు లండనులో అభిప్రాయ సేకరణ చేశారా అని అడిగారు. 2004లోనే ప్రజాభిప్రాయం వెల్లడైందని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో సమగ్రాభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని, అది ప్రజాభిప్రాయం కాదా అని ఆయన అన్నారు.

తెలంగాణను ఇస్తామని అంటున్న కాంగ్రెసుకు ఎలా ఓటేస్తారని చంద్రబాబు ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేశారని, అయినా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించారని, అది ప్రజాభిప్రాయం కాదా అని ఆయన అన్నారు. కాలయాపన చేయడానికే చంద్రబాబు కమిటీలు అంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కరీంనగర్ లోకసభ ఫలితం తెలంగాణకు రెఫరెండం అని చెప్పిన ముఖ్యమంత్రి మాట మార్చారని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డిని, చంద్రబాబును నమ్మడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర చేసి ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ఓడించాలని చూస్తున్నాయని, ఈ పార్టీలు రెండు చీకటి స్నేహం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. తమ పార్టీని రెండు మూడు చోట్లనైనా ఓడించి తెలంగాణవాదం లేదని ప్రచారం చేయడానికి ఈ రెండు పార్టీలు ఎత్తులు వేశాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+