శ్రీహరి వ్యవహారంపై దుష్ప్రచారం: దేవేందర్

కాంగ్రెసుతో అంతర్గత అవగాహన ఏదీ లేదని, నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మునుపెన్నడూ జరగనంత అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తాము కలిసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెరాస రెండూ ఒక్కటేనని, రెండు కలిసే నాటకం ఆడుతున్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమకూ తెరాసకు మధ్యనే పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేశామని ఆయన చెప్పారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని, వామపక్షాలతో మాట్లాడుతున్నామని, వామపక్షాలకు మూడు సీట్లు ఇస్తామని ఆయన చెప్పారు.
కడియం శ్రీహరి విషయంలో కొందరు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. శ్రీహరి మాటలకు పెడర్థాలు తీస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. అన్ని పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలుంటాయని, కీలకమైవ అంశాలపై అభిప్రాయాలు వెల్లడించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications