రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

హైదరాబాద్: మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. మహబూబ్ నగర్ లోని టీబీ ఆస్పత్రిగా ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. వీరంతా కూలీలే. అప్పనపల్లి నుంచి వీరు జడ్చర్లకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద గల వంతెన మీద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్వర్ణకుమారి అనే మహిళ అమెరికా నుంచి వచ్చి కారులో స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్వర్ణకుమారి మరణించింది. లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+