విశాఖపట్నం: విశాఖపట్నంలో గురువారం హీరో అల్లు అర్జున్ రాక హల్ చల్ సృష్టించారు. "పరుగు" చిత్రం అర్ధ శత దినోత్సవం సందర్భంగా ఆ వేడుకలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు. మొదట అల్లు అర్జున్ సాగర్ తీరంలో ఉన్న తాతయ్య అల్లు రామలింగయ్య కాంశ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన రాకతో అభిమానులు కరచాలనం కోసం ఆటో గ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో అభిమానులు తోసుకుని రావడంతో అతి కష్టం మీద ఆయన బయటపడ్డారు.