ముస్లిం రిజర్వేషన్లకు 'సుప్రీం' ఒకె
న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ పూర్తయిన ముస్లిం విద్యార్థలకు బిసి ఇ - కోటా కింద అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు తుది తీర్పుకు లోబడే ఈ అనుమతి ఇచ్చినట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.
మైనారిటీ కోటా కింద ముస్లింలకు అడ్మిషన్లలో 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. ముస్లిం రిజర్వేషన్లపై కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు హైకోర్టుకే వదిలేసింది.












Click it and Unblock the Notifications
