ఒకే కుటుంబలో ముగ్గురు మృతి
మహబూబ్ నగర్: మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు మండలంలో శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మండలంలోని పెద్ద ముదునూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలు విషపు గుళికలు సేవించి మృతి చెందారు.
సత్యనారాయణ అత్తమామలకు చెప్పటంతో ఈ సంఘటన తెలియవచ్చింది. సత్యనారాయణే ఈ హత్యలు చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ముగ్గురి మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications