చిరంజీవి పార్టీపై చంద్రబాబు మండిపాటు

యువగర్జన సదస్సుతో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోతుందని ఆయన అన్నారు. వచ్చేనెల 5వ తేదీన జరిగే యువగర్జన సదస్సును కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో ప్రోత్సాహం నింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెసుకు కూడా ఏం చేయాలో తెలియడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు అధిష్ఠానవర్గం రెండు సార్లు పిలిపించిందని ఆయన చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications