బోర్డర్ వద్ద ముగ్గురు తీవ్రవాదుల హతం
ఫూంచ్: సరిహద్దు రేఖ అవతలివైపు నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన చొరబాటుదారులపై సైన్యం కాల్పులు జరపడంతో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. ఫూంచ్ జిల్లాలోని సబ్జియాన్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఓ తీవ్రవాదుల గుంపు భారత్లోకి రావడానికి ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన భారత భద్రతాదళాలు వారిపైకి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారని సైనికాధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications