నీ ఊరికేం చేశావు: చిరుకు వైయస్ ప్రశ్న

చిరంజీవి తెచ్చే మార్పు ఏమిటని ఆయన అడిగారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఆపుతారా, ఏడున్నర లక్షల మందికి పెన్షన్లు అపుతారా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా అపుతారా, స్త్రీలకు ఇచ్చే పావలా వడ్డీకే రుణాలను ఆపుతారా అని ఆయన అడిగారు. రాష్ట్రాభివృద్ధిలో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెసుకు ఎవరూ సాటి రారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. గుంటూరు జిల్లా పర్యటనలో తొలుత తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తిన ఆయన తదనంతరం చిరంజీవిపై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications