వైయస్ వి కారుకూతలు: కెసిఆర్

తెలంగాణపై ముప్పేట దాడి జరుగుతోందని, నిధులు, వనరులు, భూములు దోపిడీకి గురవుతున్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి అడ్వర్జయిజ్ మెంట్లలోనే కనిపిస్తోందని, ఆచరణలో జరిగిందేమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చేసిందేమిటి, ఒరిగిందేమిటని ఆయన అడిగారు. తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పార్టీల గొంతు నొక్కడానికే రోడ్ షోలపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయించిందని ఆయన విమర్శించారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టు ప్రభుత్వం చేస్తున్న దగాల్లో మరోటి అని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే దీనికి టెండర్లు పిలుస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications