ప్రముఖ సినీ నిర్మాత త్రివిక్రమరావు మృతి
హైదరాబాద్:తెలుగుసినీ పరిశ్రమలో గుర్తుంచుకోదగిన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు కన్నుమూశారు. విశాఖపట్నానికి చెందిన త్రివిక్రమరావు స్వర్గీయ ఎన్.టి. రామారావుతో గల పరిచయంతో, ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్, శోభన్బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితర ప్రముఖ నటులతో పలు చిత్రాలు నిర్మించారు.
ఆయన ఎన్టీఆర్తో నిర్మించిన జస్టిస్ చౌదరి చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఆయనకు, ఎన్టీఆర్కు ఎంతో పేరు తెచ్చింది. ఖైదీ రుద్రయ్య, ఆహ్వానం వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. హిందీలో సైతం అప్పటి అగ్రనటుడు జితేంద్ర హీరోగా పలు చిత్రాలు నిర్మించారు. ఆయన ఆఖరు సినిమా బద్రి..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చింది. కొంతకాలంగా నిర్మాణరంగానికి ఆయన దూరంగా ఉన్నారు. త్రివిక్రమరావు మృతికి నిర్మాతలమండలి సంతాపం తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications