వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికే విలాస్ రావు దేశ్ ముఖ్

By Staff
|
Google Oneindia TeluguNews

Vilasrao Deshmukh
న్యూఢిల్లీ: ముంబయి ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌పై వేటుకే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గుచూపింది. విలాస్‌ ఇంతకుముందే తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీకి అందజేయగా, పార్టీ సీనియర్‌ నేతలతో పలు సార్లు సంప్రదింపుల అనంతరం ఆయన తొలగింపుపై ఆమె నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని పార్టీ సీనియర్‌ నాయకుడు, మహారాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ ఏకే ఆంటోనీ ప్రకటించారు.

అంతకుముందు ఆంటోనీ, విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌లతో సోనియా తన నివాసంలో సమావేశమయ్యారు. విలాస్‌ సోమవారం ఉదయంలోపు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌సీ జమీర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు. ముంబయిలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పదవి కోల్పోయిన కాంగ్రెస్‌కు చెందిన రెండో నాయకుడు విలాసే. కొద్ది రోజుల క్రితం పార్టీ సీనియర్‌ నేత శివరాజ్‌పాటిల్‌ కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

నేడు సీఎల్‌పీ భేటీ: విలాస్‌ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కానున్నారనే అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవికి పోటీ పడుతున్న పలువురు నాయకుల్లో కేంద్ర మంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, పృథ్వీరాజ్‌ చవాన్‌; మహారాష్ట్ర మంత్రులు నారాయణ్‌ రాణే, అశోక్‌ చవాన్‌ ముందంజలో ఉన్నారు. గురువారం ముంబయిలో జరిగే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్‌పీ) సమావేశం కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) పరిశీలకుల బృందమొకటి ఈ భేటీకి హాజరుకానుంది. విలాస్‌కు వారసుడిని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని, ఐతే సీఎల్‌పీ భేటీలోనే సదరు నేత పేరు ప్రకటిస్తారని, ఆయన్నే ఎమ్మెల్యేలు లాంఛనంగా తమ నాయకుడిగా ఎన్నుకొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X