ఇంటికే విలాస్ రావు దేశ్ ముఖ్
అంతకుముందు ఆంటోనీ, విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ, తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్లతో సోనియా తన నివాసంలో సమావేశమయ్యారు. విలాస్ సోమవారం ఉదయంలోపు రాష్ట్ర గవర్నర్ ఎస్సీ జమీర్కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు. ముంబయిలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పదవి కోల్పోయిన కాంగ్రెస్కు చెందిన రెండో నాయకుడు విలాసే. కొద్ది రోజుల క్రితం పార్టీ సీనియర్ నేత శివరాజ్పాటిల్ కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.
నేడు సీఎల్పీ భేటీ: విలాస్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కానున్నారనే అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవికి పోటీ పడుతున్న పలువురు నాయకుల్లో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్; మహారాష్ట్ర మంత్రులు నారాయణ్ రాణే, అశోక్ చవాన్ ముందంజలో ఉన్నారు. గురువారం ముంబయిలో జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) పరిశీలకుల బృందమొకటి ఈ భేటీకి హాజరుకానుంది. విలాస్కు వారసుడిని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని, ఐతే సీఎల్పీ భేటీలోనే సదరు నేత పేరు ప్రకటిస్తారని, ఆయన్నే ఎమ్మెల్యేలు లాంఛనంగా తమ నాయకుడిగా ఎన్నుకొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.