చెన్నా నా పేరు చెప్పలేదు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: హైదరాబాదులో 1989లో జరిగిన మత ఘర్షణల్లో వైయస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఉందని అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి చెప్పలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. హైదరాబాదు మత ఘర్షణల్లో కడప మనుషుల పాత్ర ఉందని అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆరోపించిన విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు గుర్తు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన గురువారం శాసనసభలో ఆయన విధంగా అన్నారు. విజయవాడ, కడప నుంచి మనుషులు మతఘర్షణల్లో పాల్గొన్నారని మాత్రమే చెన్నారెడ్డి అన్నారని, తన పేరును చెన్నారెడ్డి ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 300 మందిని హతమార్చే మతఘర్షణల్లో తన పాత్ర ఉందని చెప్పడం చంద్రబాబుకు న్యాయం, భావ్యం కాదని ఆయన అన్నారు. ఈ మతఘర్షణల్లో రాజకీయ నేతల పాత్ర లేదని విచారణ సంఘం తేల్చిందని ఆయన గుర్తు చేశారు.

తన తండ్రిని చంపినవారిపై, తనపై దాడి చేసినవారిపై తాను ప్రతీకార చర్యలకు పూనుకోలేదని, తమది అటువంటి సంప్రదాయమని ఆయన అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితులను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారని, నిందితుడిని తనపై పోటీకి దించారని ఆయన అన్నారు. తనపై చంద్రబాబు 1996 ఎన్నికల సందర్భంగా 26 కేసులు పెట్టించారని ఆయన అన్నారు. తమది ఫ్యాక్షనిస్టు ధోరణా, అవతలి వాళ్లదా అని ఆయన ప్రశ్నించారు. అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేస్తే తాము విమర్శలు చేశామా, రాజకీయం చేయడానికి ప్రయత్నించామా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రిపై దాడి చేసే స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉందని, ఇప్పుడు నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. తీవ్రవాద సమస్యను పరిష్కరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+