వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు మంత్రులా? కేసీఆర్‌ విసుర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాల్లో తెరాస తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టమని ప్రభుత్వం స్పందించకపోవడంపై తెరాస అధినేత కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తీర్మానంపై తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యులు స్పందించకపోవడంపై మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కట్టుబానిసలుగా మారారని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ ప్రజలు ముఖం మీద తలుపులు మూసేస్తారన్నారు. స్పీకర్‌ తెలంగాణకు చెందినవాడైనప్పటికీ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. ఎంపీల అనర్హత కేసుపై లోక్‌సభ స్పీకర్‌ క్షణాల్లో నిర్ణయం తీసుకుంటే... ఈ స్పీకర్‌ మాత్రం తెరాస సభ్యుల అనర్హతపై రెండేళ్ల నుంచి నాన్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్‌రెడ్డికి ప్రాంత ప్రయోజనం కంటే... ముఖ్యమంత్రి ప్రయోజనాలు ముఖ్యమని జనం అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆగ్రహంతో కాంగ్రెస్‌ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X